పాదయాత్ర పేరుతో జగన్ డ్రామాలు ఆడుతున్నారని, ఆయన రాజీకియ నాయకుడిలా కాక నటుడుగా మరారని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ విమర్శించారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ పేదల సొమ్ము దోచుకున్న జగన్ కు తనపై విమర్శలు చేసే అర్హత లేదని, తనపై భూకబ్జా ఆరోపణలు చేసిన జగన్ దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. తిత్లి తుఫాను బాధితులను పరామర్శించని జగన్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.