ఏపీ రాజధాని అమరావతికి మద్దతు కోరుతూ హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఎదుట అమరావతి ఐకాస, విద్యార్థులు శనివారం ఉదయం ధర్నా నిర్వహించారు. ఐకాస సభ్యులు, విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని ఫిల్మ్ ఛాంబర్ వద్ద నినాదాలు చేశారు. అమరావతికి మద్దతు ప్రకటించకపోతే ఏపీలో సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు విద్యార్థులకు సంఘీభావం తెలిపారు.