కర్నూలు - కడప జిల్లా నేతలతో సీఎం చంద్రబాబు ఈరోజు సమావేశం కానున్నారు. కర్నూలులో కోట్ల కుటుంబాన్ని టీడీపీ లోకి చేర్చుకునే అంశంపై ఈరోజు మధ్యాహ్నం కెఇ కుటుంబ సభ్యులతో చంద్రబాబు చర్చించనున్నారు. కడప జిల్లా నేతలతోను సీఎం సమావేశం కానున్నారు. మంత్రి ఆది, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి లతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఇద్దరిలో ఒకరిని కడప ఎంపీ గాను, మరొకరిని జమ్మలమడుగు అభ్యర్థిగాను చంద్రబాబు ప్రకటించనున్నారు.